నగరానికి దూరంగా కొండ మీద ఒక అందమయిన ఇల్లు. అత్యంత ఆధునిక సౌకర్యాలు, అధునాతన భద్రతా వ్యవస్థ కలిగిన ఇల్లు అది. పైకి సైనిక స్థావరంలా కట్టుదిట్టంగా కనిపించినా లోపల ఇంటీరియర్ డెకొరేషన్ మాత్రం వేరే లోకంలో ఉన్నామా అన్న అనుభూతి కలిగించక మానదు. ఆ ఇంట్లో కొండ అంచున ఉన్న ప్రత్యేకమయిన అద్దాల గది మన ఈశ్వర్ పర్సనల్ వర్క్ స్పేస్ . ఇంతకీ ఈశ్వర్ ఎవరో చెప్పలేదు కదూ!!! ఈయనే మన కధలో హీరో. ఊహ తెలియని వయసులో అనుకోని దుర్ఘటన వల్ల రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన ఈశ్వర్, కొందరి సహాయంతో తనకి ఊహ తెలిసేవరకు అనాధాశ్రమంలో ఉన్నాడు. దిక్కులేనివారికి దేవుడే దిక్కు అన్నట్లు రామకృష్ణ అనే స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈశ్వర్ ని దత్తత తీసుకుని విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రతి ఒక్కరికి వృత్తి, ప్రవృత్తి అని రెండు ఉంటాయి ... ఒకటి పూట గడవడానికి, రెండోది మనసు నడవడానికి, మన మాస్టర్ గారికి చిత్రలేఖనం అంటే మిక్కిలి మక్కువ. ఆ మక్కువతో ఆ వయసులో గోవింద్ అనే ఆర్టిస్ట్ దగ్గర పాఠాలు నేర్చుకునేందుకు తనతోపాటు ఈశ్వర్ ని కూడా వెంటతీసుకుపోయేవారు. వయసులో చిన్నవాడయినా చెప్పిన ప్రతీ విషయాన్ని, నేర్పిన ప్రతీ అంశాన్ని ఎంతో శ్రద్ధతో విని